టోక్యో పారా ఒలింపిక్స్ ఆర్చరీ విభాగంలో భారత్కు మరో పతకం లభించింది. శుక్రవారం పురుషుల ఆర్చరీ వ్యక్తిగత రికవరి పోటీలలో హర్వీందర్ సింగ్ కాంస్య పతకం సాధించాడు. కాంస్య పతక పోరులో ఆయన కొరియన్ అథ్లెట్ కిమ్పై 10-8 తేడాతో గెలిచాడు. ఆర్చరీ విభాగంలో తొలి పతకం సాధించి హర్వీందర్ సింగ్ రికార్డులకెక్కాడు. దీంతో ఈ పారాలింపిక్స్లో భారత్కు 13 పతకాలు లభించాయి.