కొరటాల శివ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా చేస్తున్న దేవర సినిమాకు సంబందించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాలో పూజా హెగ్డే ఐటెమ్ సాంగ్ చేయబోతోందట. ఆమె ఇదివరకు రంగస్థలం జిగేల్ రాణి అంటూ మెరుపులు మెరిపించింది. కనుక ఇప్పుడు జూ.ఎన్టీఆర్ సినిమా కోసం అడగగనే వెంటనే ఒప్పేసుకుందట. ఈ విషయాన్ని దేవర టీం ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ విలన్గా నటిస్తుండగా ప్రకాష్రాజ్, శ్రీకాంత్, రమ్యకృష్ణ, చైత్ర రాయ్, కలైయరసన్, టామ్ షైన్ చాకో, నరైన్ నారాయణ్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ 50 శాతం పూర్తయిన తర్వాత దీనిని రెండు భాగాలుగా తీస్తే ఇంకా బాగుంటుందని దర్శక నిర్మాతలు, జూ.ఎన్టీఆర్ భావించడంతో రెండు భాగాలుగా తీయబోతున్నట్లు ప్రకటించారు. మొదటి భాగం ఈ ఏడాది అక్టోబర్ 10న విడుదల కాబోతోంది.