వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమీషన్ గురువారం షెడ్యూల్ ప్రకటించింది. ఈ ఉప ఎన్నికకు మే 2న నోటిఫికేషన్ జారీ అవుతుంది. ఆదేరోజు నుంచి మే 9వరకు నామినేషన్స్ ప్రక్రియ కొనసాగుతుంది. నామినేషన్స్ ఉపసంహరణకు గడువు మే 13. మే 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. జూన్ 5వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.
ఈ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి 2023 డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికలలో జనగామ నుంచి బిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక జరుగుతోంది.
ఈ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అప్పుడే తీన్మార్ మల్లన్నని అభ్యర్ధిగా ప్రకటించింది. బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు ఇంకా అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది.