నిజామాబాద్ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న టి.జీవన్ రెడ్డి ఆర్మూరు మండలంలో పర్యటిస్తున్నప్పుడు, ఆ ప్రాంతంలో ఉపాధి పనులు జరుగుతుండటం చూసి అక్కడకు వెళ్ళి ఓ మహిళా కార్మికురాలితో మాట్లాడారు.
శాసనసభ ఎన్నికలలో తాను కాంగ్రెస్ పార్టీకే ఓటు వేశానని కానీ తనకు పింఛన్ లభించడం లేదని కనుక ఈసారి పువ్వు (కమలం) గుర్తుకే ఓటు వేస్తానని చెప్పడంతో జీవన్ రెడ్డి ఆమె చెంప చెళ్ళుమానిపించారు.
ఆయన ఓ మహిళను చెంప దెబ్బ కొట్టడాన్ని ఆయన వెంట ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎవరూ తప్పుగా అనుకోలేదు. పైగా అందరూ పకపకమని నవ్వారు. అది చూసి తోటి కార్మికులు ఇంకా ఆగ్రహం చెందారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై బిఆర్ఎస్ పార్టీ ఘాటుగా స్పందించింది కానీ కాంగ్రెస్ పార్టీ ఇంకా స్పందించలేదు.
ఓ మహిళా కార్మికురాలు జీవన్ రెడ్డికి తన గోడు చెప్పుకుంటే జాలి పడి ఆమెకు తప్పకుండా పింఛన్ ఇప్పిస్తానని, కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉంచమని కోరి ఉండాలి. కానీ ఆమె ఓ సాధారణ మహిళా కార్మికురాలు. రోజువారీ కూలి చేసుకుని బ్రతికే మనిషి. వృద్ధురాలైనప్పటికీ ఇంకా ఉపాదిహామీ కూలి పనులు చేసుకుని బ్రతుకుతున్నారు. ఆమె పరిస్థితికి జాలి పడాల్సిన జీవన్ రెడ్డి అందరి ముందు ఆమెను చెంపదెబ్బ కొట్టారు.
I don’t know what is more disgusting! Nizamabad MP Congress candidate Jeevan Reddy slapping an old woman or all the other men standing around and laughing like it is some kind of a joke?!
On Friday, when former minister and #Nizamabad MP candidate Jeevan Reddy was campaigning… pic.twitter.com/LEtB63p2MG