జియాగూడ రంగనాథస్వామి ఆలయ ప్రధాన అర్చకుడు ఆకస్మిక మృతి

April 24, 2024
img

జియాగూడాలోని ప్రముఖ వైష్ణవాలయం శ్రీ రంగనాధస్వామి ఆలయ ప్రధాన అర్చకుడు శృంగారం రాజగోపాలాచార్యులు (55) సోమవారం రాత్రి గుండెపోటుతో కన్ను మూశారు. ఆలయ నిర్వాహకులు శేషాచార్యులు ఈ విషయం మీడియాకు తెలియజేశారు. 

 శృంగారం రాజగోపాలాచార్యులు వందకు పైగా దేవాలయాల ప్రతిష్టాపనలు చేసి మంచి పేరు సంపాదించుకున్నారు. విదేశాలలో కూడా అనేక ఆలయాలలో దేవతామూర్తుల ప్రతిష్టాపనలు చేశారు. దేవతామూర్తుల ప్రత్యేక అలంకారాలు చేసే ‘భట్టర్’గా కూడా ఆయన భక్తులకు సుపరిచితులు. శృంగారం రాజగోపాలాచార్యులు మంగళవారం ఉదయం కూడా శ్రీ రంగనాధస్వామి ఆలయంలో నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు. రాత్రి ఇంటికి చేరుకున్నాక గుండెపోటుతో కుప్ప కూలిపోయారని తుదిశ్వాస విడిచారని శేషాచార్యులు చెప్పారు. 

శృంగారం రాజగోపాలాచార్యులు భార్య, ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. ఈరోజు ఉదయం పురానాఫూల్ హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన సోదరుడు చెప్పారు.

Related Post