ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు బిఆర్ఎస్ అభ్యర్ధి ఖరారు

May 05, 2024


img

ఈ నెల 27వ తేదీన నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగబోతోంది. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా ఏనుగుల రాకేష్ రెడ్డి పేరుని కేసీఆర్‌ ఖరారు చేశారు.

ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి శాసనసభ ఎన్నికలలో జనగామ నుంచి పోటీ చేసి గెలవడంతో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అందువల్ల ఈ ఉప ఎన్నిక జరుగుతోంది.

కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తీన్మార్ మల్లన్నను అభ్యర్ధిగా ప్రకటించగా ఆయన తొలిరోజే నామినేషన్ వేసి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేశారు. 

ఈ నెల 13వరకు నామినేషన్స్‌ ఉపసంహరణకు గడువు ఉంది. ఈ నెల 27వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. జూన్ 5వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.


Related Post