రఫెల్ కూల్చేశారా సాక్ష్యం ఉందా?

May 08, 2025
img

‘ఆపరేషన్ సింధూర్‌’తో భారత్‌ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోతుంటే, పాక్‌ పాలకుల ప్రగల్భాలు, డ్రామాల వల్లన ఆ దేశం నవ్వుల పాలవుతోంది.

ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ‘సీఎన్ఎన్’మీడియాకి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో భారత్‌కు చెందిన అత్యాధునిక రఫెల్ యుద్ధ విమానంతో సహా మొత్తం 5 విమానాలు కూల్చేశామని గొప్పగా చెప్పుకున్నారు. తమ మిలట్రీ భారత్‌ దళాలని సమర్ధంగా ఎదుర్కొని తిప్పి కొట్టిందని చెప్పారు. 

అప్పుడు సీఎన్ఎన్ ప్రతినిధి అయితే మీరు కూల్చేసిన భారత్‌ యుద్ధ విమాన శకలాలు చూపించగలరా?” అని ప్రశ్నించేసరికి ఆయన తడబడుతూ “సోషల్ మీడియాలో  ఆ ఫోటోలు వస్తున్నాయి కదా?అవి మా సోషల్ మీడియాలో కూడా కాదు.. భారత్‌ సోషల్ మీడియాలోనే వస్తున్నాయి.. కావాలంటే వాటిని చూడండి,” అని సమాధానం ఇచ్చారు. 

సీఎన్ఎన్ ప్రతినిధి స్పందిస్తూ “సోషల్ మీడియాలో వచ్చే ఫోటోలు, వీడియోలు కాదు.. మీ వద్ద మరేమైనా సాక్ష్యాధారాలున్నాయా?” అని సూటిగా ప్రశ్నించేసరికి ఆయన జవాబు చెప్పలేక తడబడ్డారు.

ఆపరేషన్ సింధూర్‌ తర్వాత భారత్‌ యుద్ధ విమానాలు కూల్చేశామని గొప్పలు చెప్పుకున్న పాక్‌ పాలకులు ఆ ఫోటోలు చూపకుండా, భారత్‌ దళాలు దాడి చేసి ధ్వంసం చేసిన తమ ఉగ్రవాద స్థావరాల ఫోటోలను చూపించి తమ దేశం పరువు తామే తీసుకున్నారు.    

భారత్‌ అంత ధీటుగా స్పందిస్తుంటే, తమ రక్షణ మంత్రి అంతర్జాతీయ మీడియా ముందు ఈవిదంగా దొరికిపోయి పాకిస్థాన్‌ పరువు తీశారని పాక్‌ ప్రజలు అంటున్నారు. నిజమే కదా?

Related Post