బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, ఏఐజీ ఆస్పత్రికి వెళ్ళారు. అయితే అనారోగ్యంతో లేదా వైద్య పరీక్షల కోసమో కాదు. ఆ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న తన మనుమడు హిమాన్షుని పరామర్శించేందుకు వెళ్ళారు.
ఆయన మనవడు, కేటీఆర్ కుమారుడు హిమాన్షు నిన్న స్నేహితులతో కలిసి ఆడుకొంటూ ఉండగా ముక్కుకి గాయమైంది. దాంతో అతనిని ఏఐజీ ఆస్పత్రిలో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న కేసీఆర్ కూడా అతనిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకునేందుకు ఆస్పత్రికి వెళ్ళారు.
తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని రేపు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తారని హిమాన్షు సోషల్ మీడియా ద్వారా తన బంధుమిత్రులకు తెలియజేశాడు.