ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ విమానాశ్రయంపై క్షిపణి దాడి జరిగింది. యెమెన్ నుంచి హౌతీ తిరుగుబాటు దారులు ఈ క్షిపణి దాడి చేశారు. అయితే అది విమానాశ్రయానికి కొంచెం దూరంలో పడి పేలిపోవడంతో పెను ప్రమాదం, విధ్వంసం తప్పింది.
ఈ విషయం తెలియడంతో ఢిల్లీ నుంచి టెల్ అవీవ్కి బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787, (ఫ్లైట్ నంబర్: ఏఐ 139) విమానాన్ని జోర్డాన్ నుంచి అబుదాబీకి మళ్ళించారు. జోర్డాన్ నుంచి మరో గంట ప్రయాణిస్తే ఎయిర్ ఇండియా టెల్ అవీవ్ విమానాశ్రయం చేరుకొని ఉండేది. కానీ ముందే తెలియడంతో ముందస్తు జాగ్రత్త చర్యగా వెనక్కు మళ్ళించారు. అక్కడి నుంచి మళ్ళీ ఢిల్లీకి చేరుకుంది. మళ్ళీ టెల్ అవీవ్కి ఎప్పుడు బయలుదేరుతుందో తెలీదు. టెల్ అవీవ్ చేరకుండా ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ తిరిగి వచ్చేయడంతో, ఈరోజు అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరాల్సిన ఆ విమానం కూడా రద్దు అయ్యింది.
టెల్ అవీవ్ విమానాశ్రయంపై క్షిపణి దాడి జరిగినందున తాత్కాలికంగా విమానాశ్రయం మూసివేసి, అక్కడి నుంచి రాకపోకలు సాగించాల్సిన ఇతర విమానాలను వేరే విమానాశ్రయాలకు మళ్ళిస్తున్నారు.