అమెరికాలో టెక్సాస్ నగరంలో ఓ దుండగుడు శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు అలన్ ప్రీమియర్ అనే ఓ షాపింగ్ సెంటర్ వద్ద తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరుపగా 8 మంది చనిపోయారు. వారిలో సరూర్ నగర్కు చెందిన తాటికొండ ఐశ్వర్య (27) కూడా ఉంది. ఆమె అక్కడ ఫర్ఫెక్ట్ జనరల్ కంట్రాక్ట్స్ కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్గా పనిచేస్తోంది. ఆమె తండ్రి నర్సిరెడ్డి రంగారెడ్డి జిల్లా కోర్టు జడ్జిగా పనిచేస్తున్నారు. ఆయన భార్య పేరు అరుణ. అమెరికాలో పెద్ద ఉద్యోగంలో స్థిరపడిన కూతురు ఐశ్వర్యకు పెళ్లి ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. కానీ ఎవరో దుండగుడు జరిపిన కాల్పులలో కూతురు చనిపోయిందని తెలిసి తల్లితండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఈ కాల్పులకు పాల్పడ్డవ్యక్తి కారులో పారిపోతుంటే పోలీసులు అతని కారును చుట్టుముట్టి కాల్చి చంపారు. లేకుంటే మరింత మందిని బలిగొనేవాడు. ఈ కాల్పులలో ఇద్దరు చిన్నారులతో సహా మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ 2023 సంవత్సరంలో ఇప్పటివరకు అమెరికాలో జరిగిన తుపాకీ కాల్పుల ఘటనలలో 195 మంది చనిపోయారు.