థాయ్‌లాండ్‌లో 83 మంది భారతీయ గ్యాంబ్లర్స్ అరెస్ట్‌!

May 01, 2023
img

థాయ్‌లాండ్‌ పోలీసులు పటాయాలోని ఓ హోటల్‌ మీద దాడి చేసి 93 మంది గ్యాంబ్లర్స్ ని అరెస్ట్‌ చేశారు. వారిలో హైదరాబాద్‌కు చెందిన చీకోటి ప్రవీణ్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 93 మందిని అరెస్ట్‌ చేయగా వారిలో 83 మంది భారతీయులే ఉండటం విశేషం. వారిలో హైదరాబాద్‌కు చెందిన మాదవ్ రెడ్డి, దేవందర్ రెడ్డిలతోపాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు ప్రముఖులు, వారి కుమారులు, బంధువులు కూడా ఉన్నట్లు సమాచారం. అరెస్ట్‌ అయినవారిలో 14 మంది మహిళలు కూడా ఉన్నారు.  

పటాయాలోని ఓ హోటల్‌లో నిర్వహిస్తున్న క్యాసినో లో పెద్ద ఎత్తున గ్యాంబ్లింగ్ జరుగుతున్నట్లు సమాచారం అందడంతో థాయ్‌లాండ్‌ పోలీసులు ఆదివారం రాత్రి ఆ హోటల్‌ను చుట్టుముట్టి అందరినీ అరెస్ట్‌ చేశారు. పోలీసులను చూసి వారు తప్పించుకొని పారిపోబోతే వారిని చుట్టుముట్టి అరెస్ట్‌ చేశారు.

వారి వద్ద నుంచి భారత్‌ నుంచి తీసుకువెళ్లిన రూ.20 కోట్లు విలువగలిగిన గేమింగ్ టోకెన్లు, భారీగా నగదు, వారి సెల్ ఫోన్లను థాయ్‌లాండ్‌ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. అరెస్టయినవారిలో ఉన్నారు. చీకోటి ప్రవీణ్‌ ఆధ్వర్యంలోనే ఈ గ్యాంబ్లింగ్ జరుగుతున్నట్లు సమాచారం.

Related Post