కెనడాలో ఎంబిఏ చేస్తున్న హైదరాబాద్ కు చెందిన కళ్యాణ్ చక్రవర్తి అనే విద్యార్ధి కారు ప్రమాదంలో మరణించాడు. అతను తన కారులో క్రీక్ అనే ప్రాంతంలో హైవేపై ప్రయాణిస్తుండగా వెనుక నుంచి వచ్చిన ఒక ట్రక్కు బలంగా డ్డీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. మధ్యతరగతి కుటుంబీకులైన అతని తల్లితండ్రులు హైదరాబాద్ లో నాగారంలో నివాసం ఉంటున్నారు. కొడుకు మరణవార్త విని వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చేతికి అందివచ్చాడనుకొన్న చెట్టంత కొడుకు అర్ధంతరంగా ప్రాణాలు కోల్పోయాడని వారు విలపిస్తున్నారు.