అమెరికాలోని టెక్సాస్ నగరంలో హైదరాబాద్కు చెందిన రాజా గవిని (41), దివ్యా ఆవుల (34), వారి స్నేహితుడు ప్రేమ్నాద్ రామనాథం (42) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రాజా, దివ్య దంపతులు హైదరాబాద్లో ముషీరాబాద్కు చెందినవారు కాగా, ప్రేమ్నాద్ రామనాథం విజయవాడకు చెందినవారు. రాజా, దివ్య ఇద్దరూ టెక్సాస్లో ఫ్రిస్కో కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. భారతకాలమాన ప్రకారం సోమవారం ఉదయం వారిరువురూ తమ కుమార్తె రియాను డ్యాన్స్ క్లాసులో దింపి, దారిలో స్నేహితుడు రామనాథంను తమ కారులో ఎక్కించుకొని వస్తుండగా వేగంగా దూసుకువచ్చిన ఓ ట్రక్ వారి కారును బలంగా డ్డీకొట్టడంతో ముగ్గురూ ఘటనాస్థలంలోనే మృతి చెందారు. టెక్సాస్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.