వాహ్ తాజ్ : ఇవాంకా

February 24, 2020
img

ఈరోజు మధ్యాహ్నం అహ్మదాబాద్‌ నుంచి ఆగ్రా చేరుకొన్న డొనాల్డ్ ట్రంప్‌ దంపతులు, ఇవాంకా-కుష్నర్ దంపతులు సుమారు గంటన్నరసేపు తాజ్ మహల్ అందాలు చూస్తూ గడిపారు. ముఖ్యంగా ఇవాంకా-కుష్నర్ దంపతులు తాజ్ మహల్ అందాలు చూసి పరవశంతో పులకించిపోయారు. ఎంతగా అంటే ఆమె వెంటనే ట్విట్టర్‌లో తన ఆనందాన్ని  పంచుకొనేంత! తాజ్ మహల్ వైభవం, సౌందర్యం చాలా అద్భుతంగా ఉన్నాయి,” అని ఇవాంకా ట్వీట్ చేశారు. ఆమె తాజ్ మహల్ గురించి గైడ్‌ను అడిగి వివరాలు తెలుసుకొన్నారు. తాజ్ పర్యటనను ఒక మధురస్మృతిగా మిగుల్చుకొనేందుకు  ఇవాంకా తన భర్త జారేడ్ కుష్నర్‌తో కలిసి తాజ్ మహల్ వద్ద అనేక ఫోటోలు తీయించుకున్నారు. విడిగా కూడా ఫోటోలకు ఫోజులిచ్చారు.

ట్రంప్ దంపతులు కూడా ఆ ప్రాంతమంతా కలియతిరుగుతూ తాజ్ మహల్ అందాలను ఆస్వాదించారు. తరువాత అందరూ డిల్లీకి బయలుదేరారు. ఈరోజు రాత్రి డిల్లీలోని మౌర్య షేర్టన్ హోటల్లో బస చేస్తారు. డొనాల్డ్ ట్రంప్ రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారిక కార్యక్రమాలతో బిజీగా గడుపుతారు. రేపు రాత్రి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రాష్ట్రపతి నివాసంలో ట్రంప్ గౌరవార్ధం ఇచ్చే విందులో పాల్గొన్నాక మళ్ళీ అందరూ అమెరికా తిరుగు ప్రయాణం అవుతారు.

Related Post