అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముద్దుల కుమార్తె ఇవంకా ట్రంప్ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఖరారయింది. ఆమె అమెరిక ప్రభుత్వ సలహాదారు హోదాలో హైదరాబాద్ లో జరుగబోయే అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు(జి.ఈ.ఎస్)లో పాల్గొనబోతున్నారు. భారతకాలమాన ప్రకారం ఆమె రేపు తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్ చేరుకొంటారు. విమానాశ్రయం నుంచి నేరుగా తను బస చేయబోయే వెస్టిన్ హోటల్ చేరుకొంటారు. మంగళవారం మాధ్యాహ్నం 2 గంటల వరకు విశ్రాంతి తీసుకొని, మధ్యాహ్నం 3 గంటలకు సదస్సు జరుగబోయే హెచ్.ఐ.సిసి కి చేరుకొంటారు. సాయంత్రం 4.25 వరకు సదస్సులో పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంటలకు సదస్సులోనే ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అవుతారు. తరువాత సుమారు 5.30 గంటలకు వెస్టిన్ హోటల్ చేరుకొని కాసేపు విశ్రాంతి తీసుకొంటారు. రాత్రి 8 గంటలకు ఫలక్ నూమా ప్యాలెస్ లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే విందు కార్యక్రమంలో పాల్గొంటారు. విందు అనంతరం రాత్రి 10.30కు వెస్టిన్ హోటల్ చేరుకొంటారు.
మరుసటి రోజు అంటే 29వ తేదీ ఉదయం 10గంటలకు హెచ్.ఐ.సి.సి.లో జరిగే సదస్సులో పాల్గొని 11 గంటలకు వెస్టిన్ హోటల్ కు తిరిగివస్తారు. సాయంత్రం 5 గంటల వరకు విశ్రాంతి తీసుకొంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విమానాశ్రయం చేరుకొని అమెరికా తిరుగు ప్రయాణం అవుతారు. అయితే ఆమె రాకపోకలకు బేగంపేట, శంషాబాద్ విమానాశ్రయాలలో దేని నుంచి సాగిస్తారనే విషయం గోప్యంగా ఉంచారు.