లండన్ పై మళ్ళీ ఉగ్రదాడి

June 05, 2017
img

లండన్ నగరంలో మళ్ళీ ఉగ్రవాదులు దాడి చేశారు. లండన్ చాలా రద్దీగా ఉండే బారో మార్కెట్ లో శనివారం రాత్రి 10 గంటలకు ముగ్గురు ఉగ్రవాదులు ఒక వ్యానుతో అక్కడ ఉన్న ప్రజలపైకి దూసుకువచ్చి వ్యానుతో డ్డీకొట్టి చంపాలని మొదట ప్రయత్నించారు. తరువాత వారు వ్యాన్ లో నుంచి ముగ్గురు ఉగ్రవాదులు పొడవైన కత్తులతో దిగి ‘అల్లా కోసం..అల్లా కోసం..’ అని అరుస్తూ దొరికినవారిపై కత్తులతో దాడి చేశారు. ఈ సంగతి తెలిసి నవెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని వారిని కాల్చి హతమార్చారు. ఈ దాడిలో ఏడుగురు పౌరులు అక్కడికక్కడే మరణించగా మరో 48 మంది గాయపడ్డారు. ఇది ఐసిస్ ఉగ్రవాదుల పనే అని ప్రాధమిక దర్యాప్తులో తేలింది. ఉగ్రవాదులు నడుములకు నకిలీ బాంబులు కట్టుకొని రావడం విశేషం. రెండు వారాల క్రితమే మాంచెస్టర్ ఎరీనా స్టేడియంలో ఒక ఉగ్రవాది ఆత్మాహుతి దాడి చేసినప్పుడు 22 మంది పౌరులు చనిపోయారు అనేకమంది గాయపడ్డారు. ఆ సంఘటన తరువాత భద్రత కట్టుదిట్టం చేసినప్పటికీ మళ్ళీ దాడి చేసి ఉగ్రవాదులు తమ ఉనికి చాటుకొన్నారు.    


Related Post