కెనడాలో రోడ్డు ప్రమాదం..ఐదుగురు భారతీయ విద్యార్దులు మృతి

March 14, 2022
img

కెనడాలోని శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు భారతీయ విద్యార్దులు ఘటనా స్థలంలోనే మరణించగా మరో ఇద్దరు హాస్పిటల్‌లో మృత్యువుతో పోరాడుతున్నారు. 

కెనడాలోని దక్షిణ ఒంటారియో పరిధిలోని క్విన్‌టెట్ వెస్ట్ సిటీలో 401వ జాతీయ రహదారిపై వారు ఓ కారులో వెళుతుండగా, వెనుక నుంచి దూసుకువచ్చిన ఓ భారీ ట్రైలర్ వాహనం దానిని బలంగా ఢీకొంది. దాంతో వారు ప్రయాణిస్తున్న కారు దాని ముందు సాగుతున్న మరో పాసింజర్ వ్యాన్‌ను బలంగా గుద్దుకొంది. రెండు వాహనాల మద్య వారి కారు నలిగిపోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు విద్యార్దులలో ఐదుగురు అక్కడే చనిపోగా మరో ఇద్దరిని కెనడా పోలీసులు హాస్పిటల్‌కు తరలించారు. 

ఈ ప్రమాదంలో చనిపోయినవారిని హర్‌ప్రీత్ సింగ్‌, జస్పీందర్ సింగ్‌, కర్నపాల్ సింగ్‌, మోహిత్ చవాన్, పవన్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. వారందరూ 21-24 ఏళ్ళలోపు వయసున్న విద్యార్దులే. వారి స్నేహితుల ద్వారా భారత్‌లోని తల్లితండ్రులకు సమాచారం అందజేశారు. చనిపోయిన, గాయపడిన విద్యార్దులు గ్రేటర్ టోరెంటో, మాంట్రియాల్లో నివశిస్తున్నట్లు గుర్తించామని కెనడా పోలీసులు తెలిపారు. కెనడాలోని భారత్‌ హైకమీషనర్ అజయ్ బిసారియా కూడా ఈ వార్తను దృవీకరించి విద్యార్దుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. 


Related Post