సత్య నాదేళ్ళ కుమారుడు మృతి

March 01, 2022
img

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ళ కుమారుడు జైన్ నాదెళ్ళ (26) మృతి చెందారు. ఆయన పుట్టుకతోనే మెదడుకు సంబందించిన భయంకర వ్యాధి సెరెబ్రల్ పాల్సీ అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి సోకినవారికి కాళ్ళు, చేతులు ఇతర శరీర అవయవాలపై నియంత్రణ ఉండదు కనుక హాస్పిటల్‌కి లేదా వీల్ చైర్‌కే పరిమితం అవుతుంటారు. జైన్ నాదెళ్ళ కూడా సీటెల్ చైల్డ్రన్స్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటివ్ బ్రెయిన్ రీసెర్చ్‌లో చిరకాలంగా చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయం సత్య నాదెళ్ళ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. సత్య నాదెళ్ళ, అను నాదెళ్ళ దంపతులకు జైన్ నాదెళ్ళతో పాటు మరో ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 


Related Post