బ్రిటన్ ప్రధాని ఐసీయూలోకి....

April 07, 2020
img

బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్‌సన్‌కు కరోనా సోకడంతో ఆదివారం రాత్రి ఆయనను లండన్‌లోని సెయింట్ థామస్ హాస్పిటల్లోని ఐసీయూలోకి తరలించారు. ఆసుపత్రికి తరలించే ముందు ఆయన బ్రిటన్ విదేశాంగ శాఖ కార్యదర్శి డామినిక్‌ రబ్‌ను ఉప ప్రధానిగా నియమించారు. 

ప్రధాని బోరిస్ జాన్‌సన్‌లో వారం రోజుల క్రితమే కరోనా వ్యాధి లక్షణాలు కనిపించడంతో అప్పటి నుంచి హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూ పరిపాలనా వ్యవహారాలు చక్కబెడుతున్నారు. వైద్యుల సలహా మేరకు ఆయన ఆదివారం రాత్రి ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని వెంటిలేటర్ అవసరం రాకపోవచ్చునని బోరిస్ జాన్‌సన్‌ ట్వీట్ చేశారు.   


Related Post