కేసీఆర్‌ అన్నా నన్ను క్షమించు: ఈటల రాజేందర్‌

June 26, 2021


img

ఈటల రాజేందర్‌ మంత్రిగా ఉండగా సిఎం కేసీఆర్‌ వైఖరి, ప్రభుత్వ విధానాల పట్ల పలు సందర్భాలలో స్వల్పంగా అసహనం, అసంతృప్తి వ్యక్తం చేసేవారని అందరికీ తెలుసు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు పెద్దపల్లి జిల్లా టిఆర్ఎస్‌ నేతలతో బెంగళూరులో రహస్యంగా సమావేశం అయ్యారని, ఆ విషయం సిఎం కేసీఆర్‌కు తెలియడంతో క్షమాపణలు కోరుతూ వ్రాసిన ఓ లేఖ సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చింది. దానిలో ఆయన పార్టీకి నష్టం కలిగించేవిదంగా వ్యవహరించినందుకు తనను క్షమించాలని, ఈ ఒక్కతప్పును క్షమిస్తే భవిష్యత్‌లో మళ్ళీ ఇటువంటి పార్టీ వ్యతిరేక పనులు ఎన్నడూ చేయబోనని వ్రాశారు. కానీ తన ప్రతిష్టను, రాజకీయంగా దెబ్బ తీసేందుకు టిఆర్ఎస్‌ నేతలే ఆ లేఖను సృష్టించారని ఈటల రాజేందర్‌ వాదిస్తున్నారు. ఈటల రాజేందర్‌ వ్రాసినట్లు చెప్పబడుతున్న ఆ లేఖ ఇదే.      



Related Post