ఈటల రాజేందర్ మంత్రిగా ఉండగా సిఎం కేసీఆర్ వైఖరి, ప్రభుత్వ విధానాల పట్ల పలు సందర్భాలలో స్వల్పంగా అసహనం, అసంతృప్తి వ్యక్తం చేసేవారని అందరికీ తెలుసు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు పెద్దపల్లి జిల్లా టిఆర్ఎస్ నేతలతో బెంగళూరులో రహస్యంగా సమావేశం అయ్యారని, ఆ విషయం సిఎం కేసీఆర్కు తెలియడంతో క్షమాపణలు కోరుతూ వ్రాసిన ఓ లేఖ సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చింది. దానిలో ఆయన పార్టీకి నష్టం కలిగించేవిదంగా వ్యవహరించినందుకు తనను క్షమించాలని, ఈ ఒక్కతప్పును క్షమిస్తే భవిష్యత్లో మళ్ళీ ఇటువంటి పార్టీ వ్యతిరేక పనులు ఎన్నడూ చేయబోనని వ్రాశారు. కానీ తన ప్రతిష్టను, రాజకీయంగా దెబ్బ తీసేందుకు టిఆర్ఎస్ నేతలే ఆ లేఖను సృష్టించారని ఈటల రాజేందర్ వాదిస్తున్నారు. ఈటల రాజేందర్ వ్రాసినట్లు చెప్పబడుతున్న ఆ లేఖ ఇదే.