ఉస్మానియా ఆసుపత్రిపై నిర్లక్ష్యం ఏల? అసదుద్దీన్ ఓవైసీ

June 22, 2021


img

హైదరాబాద్‌ నగరంలో నిత్యం వేలాదిమందికి వైద్యసేవలందిస్తున్న ఉస్మానియా ఆసుపత్రిని సిఎం కేసీఆర్‌ పట్టించుకోకపోవడంపై మజ్లీస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం తన పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి ఉస్మానియా ఆసుపత్రిలో పర్యటించి వైద్యాధికారులతో పరిస్థితిని సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరధ, కాళేశ్వరం ప్రాజెక్టు, రైతుల కోసం వేలకోట్లు ఖర్చు చేస్తోంది కానీ ఉస్మానియా ఆసుపత్రి శిధిలావస్థకు చేరుకొన్నా కొత్త భవనం నిర్మించడం లేదు. ఉస్మానియా ఆసుపత్రిలో పలు సమస్యలు నెలకొన్నకారణంగా పూర్తిస్థాయిలో సేవలు అందించలేకపోతోంది. దీంతో పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉస్మానియా ఆసుపత్రి పునర్నిర్మాణంపై న్యాయవివాదాలు, సమస్యలను సాకుగా చూపుతూ కాలక్షేపం చేయకుండా ప్రభుత్వం తక్షణం ఆసుపత్రి పక్కనే కొత్త భవనం నిర్మించాలి లేకుంటే సహించబోము,” అని అన్నారు. 



Related Post