మాజీ మంత్రి ఈటల రాజేందర్ రెండుమూడు రోజులలో బిజెపిలో చేరాలనుకొన్నప్పటికీ ఆ కార్యక్రమాన్ని మరో వారం రోజులపాటు వాయిదా వేసుకొన్నట్లు తాజా సమాచారం. మంచి ముహూర్తం చూసుకొని మళ్ళీ ఢిల్లీ వెళ్ళి బిజెపి పెద్దల సమక్షంలో కాషాయకండువా కప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈటల రాజేందర్ శనివారమే తన రాజీనామా పత్రాన్ని స్పీకర్కు అందజేస్తారనుకొన్నప్పటికీ అదీ వాయిదా పడింది. మంగళవారం, బుదవారాలలో స్పీకర్ అపాయింట్మెంట్ ఎప్పుడు లభిస్తే అప్పుడు వెళ్ళి రాజీనామా పత్రాన్ని అందజేయాలని ఎదురు చూస్తున్నారు. స్పీకర్కు రాజీనామా పత్రాన్ని అందజేయగానే మంచిరోజు చూసుకొని ఢిల్లీ వెళ్ళి బిజెపిలో చేరుతారు. ఈటల రాజేందర్తో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ తదితరులు బిజెపిలో చేరబోతున్నారు.