తెలంగాణ ప్రజలకు వైఎస్ షర్మిల అభయహస్తం!

May 22, 2021


img

తెలంగాణ ప్రజలకు వైఎస్ షర్మిల అభయహస్తం ఇస్తున్నారు. ఆమె నిన్న హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ నివాసం నుంచి జిల్లా స్థాయి డ్వాక్రా మహిళలతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడుతూ, “మీరందరూ ఎన్ని కష్టాలు పడుతున్నారో నాకు బాగా తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్సార్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అప్పుడు నేను అధికారంలోకి రాగానే మీ అందరి కష్టాలు తీరుస్తాను. అంతవరకు మిమ్మల్ని మోసం చేస్తున్న ఈ ప్రభుత్వానికి మీ ఓట్లతో బుద్ది చెపుతుండండి,” అని అన్నారు. 

తెలంగాణ ఏర్పడిన ఆరున్నరేళ్ళ వరకు కనిపించని వైఎస్ షర్మిల, హటాత్తుగా వచ్చి తెలంగాణ ప్రజల కోసం కన్నీళ్ళు కార్చుతుండటం...ప్రజలకు భరోసా ఇస్తుండటం చాలా నాటకీయంగా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్‌, బిజెపిలే టిఆర్ఎస్‌ ధాటిని తట్టుకొని నిలబడలేకపోతున్నాయి. కానీ ఆంద్రా నుంచి వచ్చిన వైఎస్ షర్మిల ఏవిదంగా తెలంగాణలో అధికారంలోకి రాగలననుకొంటున్నారో తెలీదు. ఆమె ఏదో పెద్ద రాజకీయవ్యూహంలో భాగంగానే తెలంగాణలో అడుగుపెట్టారని ప్రజలే అనుకొంటున్నారు. అది ఏమిటో రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.


Related Post