ఈ రాజకీయ మధనంలో ఇంకా ఏమోస్తాయో?

May 19, 2021


img

అలనాడు దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగర మధనం చేస్తే మొదట హాలాహలం (విషం) తరువాత అమృతం పుట్టిందని పురాణాలు చెపుతున్నాయి. అయితే ప్రస్తుతం కరీంనగర్‌ జిల్లాలో మంత్రి గంగుల కమలాకర్‌, ఈటల రాజేందర్‌ చేస్తున్న రాజకీయ సాగర మధనంలో తరువాత అమృతం వస్తుందో లేదో తెలీదు కానీ ముందుగా హాలహలమే పుట్టుకొస్తోంది.  

ఈ సందర్భంగా వారిరువురూ ఒకరి అవినీతి భాగోతాలను మరొకరు బయటపెట్టుకొంటున్నారు. పైగా మేము బయటపెట్టింది గోరంత...ఇంకా కొండంత ఉంది. సమయం వచ్చినప్పుడు ఆ భాగోతాలు కూడా బయటపెడతామని పరస్పరం హెచ్చరించుకొంటున్నారు. వారి గురించి వారు చెప్పుకొంటున్న ఈ కొత్త విషయాలు విని ప్రజలు షాక్ అవుతున్నారు.

“కానీ ఇంతకాలం ఒకే పార్టీలో ఉన్నాము గనుకనే ఈటలను గౌరవించామని...ఇప్పుడు ఆ అవసరం లేదని” మంత్రి గంగుల చెప్పడం గమనిస్తే, పార్టీలో ఉన్నంతకాలం అందరూ కడిగిన మేలి ముత్యాలేనని, కానీ ఒక్కసారి పార్టీని వీడి  బయటకు వెళితేనే ఇటువంటివన్నీ బయటపడతుంటాయని స్పష్టం అవుతోంది.

ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు పక్కనపెడితే మంత్రి గంగుల, ఈటల రాజేందర్‌ చేస్తున్న ఈ తెలంగాణ రాజకీయ సాగర మధనంలో చివరికి ఏమవుతుందో? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Related Post