రాష్ట్రంలో ఈటల ఎపిసోడ్ ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉండగా ఇతర పార్టీల నేతలు ఒకరొకరుగా వచ్చి ఆయనతో భేటీ అవుతుండటం చూస్తుంటే రాబోయే రోజులలో ఏదో జరుగబోతోందని స్పష్టమవుతోంది. ఇటీవల కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి మొన్న ఈటలతో భేటీ కాగా, నిన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాములు నాయక్ ఆయన నివాసానికి వెళ్ళి సుమారు గంటన్నరసేపు భేటీ అయ్యారు. అయితే రాములు నాయక్ మీడియాతో మాట్లాడకుండానే వెళ్ళిపోయారు. తరువాత మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్ కూడా తమ భేటీ గురించి ఏమీ మాట్లాడలేదు. కనుక ఆయన కాంగ్రెస్ దూతగా ఈటల రాజేందర్ను పార్టీలో చేరమని ఆహ్వానించేందుకు వచ్చారా లేక ఆయనే కాంగ్రెస్ పార్టీని వీడి ఈటల రాజేందర్తో కలిసి పనిచేస్తానని చెప్పేందుకు వచ్చారా? అనే విషయం తెలియదు. మరికొన్ని రోజులలో ఎలాగూ ఈ సస్పెన్స్ వీడుతుంది కనుక అంతవరకు ఈటల ఎపిసోడ్స్ కొనసాగుతూనే ఉండవచ్చు.