ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసమే వైసీపీ నుంచి తాను టిఆర్ఎస్లోకి వచ్చానని తెలిపారు. ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం శాయశక్తుల ప్రయత్నిస్తున్నానని తెలిపారు. కానీ ఇప్పుడు పార్టీలో కొందరు తనను అవమానిస్తున్నారని ఆరోపించారు. తాను ఖమ్మం జిల్లాలో పర్యటించాలంటే ఎవరి పర్మిషన్ అయినా తీసుకోవాలా?అని ఘాటుగా ప్రశ్నించారు. పార్టీలో కొందరు కావాలనే తనపై పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను తెరాసలోనే కొనసాగుతానని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
శ్రీనివాస్ రెడ్డి చేసిన ఈ విమర్శలతో ఖమ్మం టిఆర్ఎస్లో లుకలుకలు బయటపడ్డాయి. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకు ముందు పార్టీలో నేతల మద్య కీచులాటలు ప్రారంభమవడం ఆ పార్టీకి చాలా ఇబ్బందికరమే.