ఇటీవల బిజెపిలో చేరిన విజయశాంతి యధాప్రకారం సోషల్ మీడియాలో సిఎం కేసీఆర్పై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. సిఎం కేసీఆర్ ఓటమి భయంతో ప్రజలను కూడా బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారని విజయశాంతి ట్వీట్ చేశారు. నియంత్రితసాగువిధానం వలన రూ.7,500 కోట్లు నష్టం వచ్చింది కనుక పంటలు కొనుగోలు చేయలేమని చెప్పియన్ సిఎం కేసీఆర్ రేపు 4 లక్షల కోట్లు అప్పులు తీర్చాలి కనుక పెన్షన్లు,డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇవ్వలేమని చెప్పి తప్పించుకోవచ్చు. కొందరు టిఆర్ఎస్ మంత్రుల ప్రకటనలు చూస్తే సిఎం కేసీఆర్ అదే ఆలోచనలో ఉన్నట్లు అర్ధమవుతోందంటూ విజయశాంతి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంకా ఏమి అన్నారో ఆమె మాటలలోనే...