త్వరలో రాష్ట్రంలో వరుసగా ఎన్నికలు జరుగనుండటంతో సిఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకొనేందుకు వారాలు కురిపిస్తున్నారు. బహుశః వాటిలో భాగంగానే టీఎన్జీవోలను, టీజీవోలను ప్రసన్నం చేసుకొనేందుకు గురువారం మధ్యాహ్నం ప్రగతి భవన్లో సిఎం కేసీఆర్ వారందరినీ విందుభోజనానికి ఆహ్వానించారు. దానికి సుమారు 200 మంది వరకు హాజరుకాబోతున్నట్లు సమాచారం. భోజనం తరువాత సిఎం కేసీఆర్ వారితో సమావేశమయ్యి వారి సమస్యలు, డిమాండ్ల గురించి అడిగితెలుసుకొని, బహుశః అక్కడికక్కడే వరాలు ప్రకటించే అవకాశం ఉంది. పీఆర్సీ గురించి సిఎం కేసీఆర్ను కలిసి మాట్లాడాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగసంఘాల నేతలకు సిఎం కార్యాలయం నుంచి ఆహ్వానం అందడంతో చాలా సంతోషంగా ఉన్నారు. బహుశః దీని తరువాత సిఎం కేసీఆర్ ఆర్టీసీ, తదితర మిగిలిన ఉద్యోగ సంఘాల నేతలతో కూడా వరుసగా ఇటువంటి ఆత్మీయ భోజన సమావేశాలు నిర్వహించినా ఆశ్చర్యం లేదు.