రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పార్థసారధి ఇవాళ్ళ ఉదయం హైదరాబాద్లోని తన కార్యాలయంలో ప్రెస్మీట్ పెట్టి జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. అన్ని రాజకీయపార్టీలతో చర్చించి ఈసారి బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఇచ్చిన రిజర్వేషన్లను అమలుచేస్తామని అదేవిధంగా 2018 అసెంబ్లీ ఎన్నికలనాటి ఓటర్ల జాబితా ప్రకారమే ఈ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఈసారి జీహెచ్ఎంసీ మేయర్ పదవి జనరల్ కేటగిరీ కింద మహిళలకు కేటాయించినట్లు తెలిపారు.
ఎన్నికల నోటిఫికేషన్: నవంబర్ 17
నామినేషన్లు దాఖలు: నవంబర్ 18 నుంచి
నామినేషన్లు దాఖలుకు చివరిరోజు: నవంబర్ 20
నామినేషన్ల పరిశీలన: నవంబర్ 21
నామినేషన్ల ఉపసంహరణకు గడువు: నవంబర్ 22
పోలింగ్: డిసెంబర్ 1 (ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు)
ఎన్నికల ఫలితాలు: డిసెంబర్ 4.