తెలంగాణ కాంగ్రెస్ ప్రచారకమిటీ చైర్ పర్సన్ విజయశాంతి దుబ్బాక ఉపఎన్నికల ప్రచారానికి వెళ్ళలేదు కానీ దుబ్బాక ఉపఎన్నికల నేపధ్యంలో సిఎం కేసీఆర్పై ట్విట్టర్లో తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
“దుబ్బాకలో లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తామని చెప్పుకొన్న మీరు కొన్ని రోజుల వ్యవధిలోనే ఒక్క ఓటుతో గెలిచినా గెలిచినట్లే అని దుస్థితి ఎందుకు దాపురించింది. దుబ్బాకలో కేవలం సానుభూతితో గెలుస్తామని అన్నారు. టిఆర్ఎస్కు ఆ సానుభూతి ఎందుకు లభిచలేదు? దుబ్బాకలో టిఆర్ఎస్ విజయం సాధించబోతోందంటూ సర్వేలలో తేలిందని చెప్పారు. కానీ ఏమైంది? జీహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా మళ్ళీ టిఆర్ఎస్ విజయం సాధించబోతోందంటూ సర్వేలు చెపుతున్నాయని ఎందుకు అబద్దాలు చెపుతున్నారు? అంటూ విజయశాంతి సిఎం కేసీఆర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సిఎం కేసీఆర్ను ఉద్దేశ్యించి ఆమె ఏమన్నారో ఆమె మాటలలోనే...