రాష్ట్ర కాంగ్రెస్ ప్రచారకమిటీ ఛైర్ పర్సన్ విజయశాంతి ప్రజలు, మీడియా ముందుకు రాకపోయినప్పటికీ తన ఫేస్బుక్ ద్వారా సిఎం కేసీఆర్ ప్రభుత్వ పనితీరుపై నిశితంగా విమర్శలు గుప్పిస్తూ ప్రజలను ఆకట్టుకొంటున్నారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ను ఆత్మహత్య వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు చేయడాన్ని స్వాగతిస్తూనే, అదేవిధంగా హీరోయిన్లు ఆత్మహత్యలు చేసుకొన్నప్పుడు ఎవరూ పట్టించుకోరని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రెండు వేర్వేరు విషయాల గురించి విజయశాంతి ఏమన్నారో ఆమె మాటలలోనే...