గవర్నర్‌ తమిళిసై రేపు కరోనాపై సమీక్ష సమావేశం

July 06, 2020


img

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మంగళవారం ఉదయం 11 గంటలకు కరోనా చికిత్స చేస్తున్న అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈవిషయం ఆమె స్వయంగా ట్వీట్ ద్వారా తెలియజేశారు. కరోనా నియంత్రణ, ఆసుపత్రులలో సౌకర్యాలకు సంబందించి ప్రజా పిర్యాదులు, కరోనా పరీక్షలు, వైద్య చికిత్సకు వసూలు చేస్తున్న ఛార్జీలు తదితర అంశాలపై చర్చించబోతున్నట్లు ఆమె ట్వీట్ చేశారు. అంతకు ముందు ప్రభుత్వ ప్రధానకార్యదర్శిని, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శితో ఫోన్లో మాట్లాడి రాష్ట్రంలో కరోనా పరిస్థితుల గురించి అడిగితెలుసుకొన్నానని ఆమె ట్వీట్ చేశారు.    

ఇటీవల కాలంలో రాష్ట్రంలో చాలామంది రాష్ట్రంలో కరోనా పరిస్థితి, ప్రభుత్వ ఆసుపత్రులలో సౌకర్యాల లేమి, ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ తదితర అంశాలపై ట్విట్టర్‌ ద్వారా ఆమెకు పిర్యాదులు చేస్తున్నారు. వాటిపై ఆమె వెంటనే స్పందిస్తున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ ఆసుపత్రుల తీరుపై వస్తున్న ఫిర్యాదుల గురించి మాట్లాడేందుకే ఆమె రేపు వారితో సమావేశం కానున్నట్లు భావించవచ్చు. 



Related Post