దేశ ప్రజలను ఉద్దేశ్యించి ప్రధాని నరేంద్రమోడీ నిన్న రాత్రి చేసిన ప్రసంగంలో లాక్డౌన్తో కరోనాను కట్టడి చేయగలిగామని అన్నారు. అయితే కరోనాను పూర్తిగా నిర్మూలించలేనందున దానితో కలిసి జీవించవలసిన అగత్యం ఏర్పడినందున మరికొంత కాలం లాక్డౌన్ పొడిగించక తప్పదని అన్నారు. అయితే దేశ ఆర్ధిక వ్యవస్థను కూడా పరిగణనలోకి తీసుకోవలసి ఉంది కనుక మే 18 నుంచి మొదలయ్యే 4వ లాక్డౌన్లో దేశంలో పలురంగాలకు మినహాయింపునిచ్చే విధంగా నియమనిబందనలు రూపొందిస్తున్నామని చెప్పారు. కనుక గత మూడు లాక్డౌన్లకు పూర్తిభిన్నంగా నాలుగవ లాక్డౌన్ ఉంటుందని అన్నారు. దానికి సంబందించిన వివరాలను మే 17లోగా ప్రకటిస్తామని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు.