కేంద్రప్రభుత్వం దేశంలో అన్ని రాష్ట్రాలలో జిల్లాలను ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల ఆధారంగా గ్రీన్, రెడ్, ఆరెంజ్ జోన్లుగా విభజించి వాటికి అనుగుణంగా ఆంక్షలు, సడలింపులను ప్రకటించింది. దేశంలో కరోనారహితంగా (గ్రీన్జోన్) 319 జిల్లాలు, కొన్ని కేసులు నమోదై కరోనా అదుపులో ఉన్నవి (ఆరెంజ్ జోన్) 284 జిల్లాలు, ఎక్కువ కేసులు నమోదైన (రెడ్ జోన్) 130 జిల్లాలు ఉన్నట్లు ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో 6 రెడ్, 18 ఆరెంజ్, 9 గ్రీన్ జోన్ జిల్లాలుగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా వివిద రాష్ట్రాలలో గ్రీన్,రెడ్,ఆరెంజ్ జోన్లు..ఆంక్షలు, సడలింపులు ఈవిధంగా ఉన్నాయి..