దేశంలో మొట్టమొదటి మొబైల్ వైరాలజీ ల్యాబ్ హైదరాబాద్లో నేడు ప్రారంభమైంది. నగరంలో ఈఎస్ఐ ఆసుపత్రి ఆవరణలో నిలిపి ఉంచి ఈ మొబైల్ వైరాలజీ ల్యాబ్ను రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ డిల్లీ నుంచి ఆన్లైన్లో ప్రారంభించారు. దీనిని ఐ క్లీన్, ఐ సేఫ్ సంస్థల సహకారంతో డీఆర్డీవో రూపొందించింది. దాదాపు పూర్తిస్థాయి ల్యాబ్లాగ దీనిని తయారుచేయబడింది కనుక కరోనా పరీక్షలతోపాటు, రకరకాల వైరస్ కల్చర్ పరీక్షలు, వ్యాక్సిన్ తయారీలో పరిశోధనలు నిర్వహించేందుకు వీలుగా అవసరమైన అన్ని పరికరాలు, ఏర్పాట్లు ఈ మొబైల్ ల్యాబ్లో ఉన్నాయి. కనుక దీనిని రాష్ట్రంలో లేదా దేశంలో ఎక్కడకి అవసరమనుకొంటే అక్కడకే తీసుకుపోయి వైద్య పరీక్షలు చేయవచ్చు.
ఈ మొబైల్ వైరాలజీ ల్యాబ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి, మంత్రి కేటీఆర్ పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.