తెలంగాణ ప్రభుత్వం మంగళవారం రాత్రి 8.00 గంటలకు విడుదల చేసిన ప్రకటన ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 56 కేసులు నమోదు అయ్యాయి. వాటితో కలిపి రాష్ట్రంలో మొత్తం 928 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మంగళవారం 8 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 194 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో 23 మంది కరోనాతో మృతి చెందారు. వివిద జిల్లాలలో నిన్న కొత్తగా నమోదైన కేసుల వివరాలు:
జిల్లా |
మంగళవారం కొత్తగా నమోదు అయిన కేసులు |
సూర్యాపేట |
26 |
జీహెచ్ఎంసీ |
19 |
నిజామాబాద్ |
3 |
గద్వాల్ |
2 |
ఖమ్మం |
1 |
మేడ్చల్ |
1 |
వరంగల్ |
1 |
ఆదిలాబాద్ |
2 |
రంగారెడ్డి |
1 |
మొత్తం |
56 |