ప్రధాని నరేంద్రమోడీ కొద్దిసేపటి క్రితం దేశప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడారు. మరో 19 రోజుల పాటు అంటే మే 3వ తేదీ వరకు దేశమంతటా లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 20వ తేదీ నుంచి వివిద రాష్ట్రాలలో, జిల్లాలలో కరోనా వైరస్ తీవ్రతను బట్టి ఎంపికచేసిన కొన్ని రంగాలకు లాక్డౌన్ ఆంక్షల నుంచి మినహాయింపు ఇస్తామని ప్రకటించారు. కానీ మళ్ళీ ఆ ప్రాంతాలలో కరోనా వైరస్ ప్రబలినట్లయితే వెంటనే మళ్ళీ నూటికి నూరుశాతం లాక్డౌన్ విధిస్తామని చెప్పారు. లాక్డౌన్ ఆంక్షల సడలింపుకు సంబందించి రేపు మార్గదర్శకాలు విడుదల చేస్తామని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. దేశప్రజలందరూ ఇదే విధంగా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించినట్లయితే కరోనాపై తప్పకుండా విజయం సాధించగలమని ప్రధాని నరేంద్రమోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.