తెలంగాణలో నేడు 32 కొత్త కేసులు..

April 13, 2020


img

తెలంగాణ రాష్ట్రంలో నేడు కొత్తగా 32 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 563కి చేరింది. ఈరోజు ఒక వ్యక్తి కరోనాతో మృతి చెందడంతో కరోనా మృతుల సంఖ్య 17కి చేరింది. ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నవారిలో ఇప్పటివరకు 103 మంది కొల్కోని డిశ్చార్జ్ అయ్యారు. 

ఆంధ్రాలో ఇప్పటివరకు 432 కేసులు నమోదు కాగా 12 మంది కోల్కొన్నారు. ఇప్పటివరకు ఏడుగురు కరోనాతో మృతి చెందారు. 

దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 2,064, ఆ తరువాత వరుసగా తమిళనాడులో 1,173, డిల్లీలో 1,154, రాజస్థాన్‌లో 847 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్రలో కరోనా మృతుల సంఖ్య కూడా నానాటికీ పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు మహారాష్ట్రలో 150 మంది కరోనాకు బలయ్యారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా కేసులు, మృతుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. మధ్యప్రదేశ్‌లో  ఇప్పటివరకు 562 పాజిటివ్ కేసులు నమోదు కాగా 44 మంది చనిపోయారు. 

దేశవ్యాప్తంగా సోమవారం ఉదయానికి 9,211 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా సాయంత్రం 7.15 గంటలకు ఆ సంఖ్య 9,539కి చేరింది. అంటే 10 గంటల వ్యవదిలో కొత్తగా 328 కేసులు నమోదు అయ్యాయన్నమాట! సోమవారం సాయంత్రానికి దేశంలో కరోనా మృతుల సంఖ్య 335కి చేరింది.


Related Post