మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రధాని మోడీ ప్రసంగం

April 13, 2020


img

ప్రధాని నరేంద్రమోడీ దేశప్రజలను ఉద్దేశ్యించి మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రసంగించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు ప్రధాని నరేంద్రమోడీ దేశప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగిస్తారని ప్రధాని కార్యాలయం కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. 

రేపటితో లాక్‌డౌన్‌ ముగుస్తుంది కనుక దాని పొడిగింపు గురించి ప్రధాని నరేంద్రమోడీ రేపు ప్రసంగంలో వివరించనున్నారు. ప్రస్తుత పరిస్థితులలో కరోనాను కట్టడి చేయడం ఎంత ముఖ్యమో, దేశ ఆర్ధిక వ్యవస్థను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. కనుక కరోనా వ్యాపించకుండా జాగ్రత్త పడుతూనే దేశంలో ఏఏ వ్యవస్థలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలి? అందుకు అనుసరించాల్సిన విధివిధానాలు, మార్గదర్శకాలను ప్రధాని నరేంద్రమోడీ తన ప్రసంగంలో వివరించే అవకాశం ఉంది. 



Related Post