సోమవారం, 8.30 గంటలు:
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 7,22,088 కరోనా కేసులు నమోదు కాగా వారిలో 1,51,766 మంది కోలుకొన్నారు. ఇప్పటివరకు 33,976 మంది కరోనాతో మరణించారు.
అమెరికాలో నానాటికీ కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ఏప్రిల్ 30వరకు లాక్డౌన్ పొడిగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు.
అమెరికాలో ఇప్పటివరకు 1,42,402 కరోనా కేసులు నమోదు కాగా వారిలో 4,767 మంది కోలుకొన్నారు. ఇప్పటివరకు 2497 మంది మరణించారు.
భారత్ ఇప్పటివరకు 1,024 కరోనా కేసులు నమోదు కాగా వారిలో 96 మంది కోలుకొన్నారు. ఇప్పటివరకు 27 మంది కరోనాతో మరణించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 70 కరోనా కేసులు నమోదు కాగా వారిలో 11 మంది కోలుకొన్నారు. ఒకే ఒకరు కరోనాతో మరణించారు.
ఆంధ్రాలో ఇప్పటివరకు 21 కరోనా కేసులు నమోదు కాగా వారందరూ ప్రస్తుతం ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కరోనాతో ఎవరూ మరణించలేదు.