కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి రాజేంద్రనగర్ కోర్టు షాక్ ఇచ్చింది. ఈరోజు ఆయన, ఐదుగురు అనుచరులు బెయిలు కోసం పిటిషన్లు పెట్టుకోగా, రేవంత్ రెడ్డికి తప్ప మిగిలిన అందరికీ కోర్టు బెయిల్పై మంజూరు చేసింది. ఇది సాధారణమైన కేసే కనుక రేవంత్ రెడ్డికి తప్పకుండా బెయిల్పై లభిస్తుందనే అందరూ అనుకున్నారు కానీ అనూహ్యంగా కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. కనుక రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది బెయిల్పై కోసం రేపు హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ఒకవేళ హైకోర్టు కూడా తిరస్కరించినా లేదా హైకోర్టును ఆశ్రయించకున్నా రేవంత్ రెడ్డి మరో రెండు వారాలు చర్లపల్లి జైలులో గడపవలసి ఉంటుంది. కేసులు, ఎఫ్ఐఆర్లు తనకు మెడల్స్ వంటివని చెప్పుకొన్న రేవంత్ రెడ్డి ఈ పరిణామాలను జీర్ణించుకోవడం కష్టమే.