నెటిజన్లకు ప్రధాని నరేంద్రమోడీ షాక్

March 03, 2020


img

ప్రధాని నరేంద్రమోడీ తాను వచ్చే ఆదివారం సోషల్ మీడియానుంచి తప్పుకోవాలనుకొంటున్నట్లు పెట్టిన ట్వీట్ మెసేజ్, ఊహించినట్లుగానే సోషల్ మీడియాలోను, దేశవ్యాప్తంగా రాజకీయాలలోనూ తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. సీఏఏకు వ్యతిరేకిస్తున్నవారు సోషల్ మీడియాలో ఆయనపై తీవ్ర విమర్శలు చేస్తున్నందునే తప్పుకోవాలనుకొంటున్నారేమో? అని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కొందరు ఆయన సోషల్ మీడియా నుంచి తప్పుకోవాలనుకోవడం సరికాదని వాదిస్తుండగా, కొందరు భయపడి పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. 

కానీ ప్రధాని నరేంద్రమోడీ వారందరికీ, ముఖ్యంగా ఈ విషయంలో తనను విమర్శిస్తున్న ప్రతిపక్షాలకు ఊహించని షాక్ ఇస్తూ కొద్ది సేపటి క్రితమే మరో ట్వీట్ చేశారు. దానిలో.. “ఓ మంచి కార్యక్రమం కోసం ఆదివారం ఒక్కరోజే నేను సోషల్ మీడియా వదిలేస్తున్నాను. ఆరోజు మహిళా దినోత్సవం. మనకు స్పూర్తిప్రదాతలైన మహిళల కోసం ఆ రోజు నా సోషల్ మీడియా అకౌంట్లు అన్ని వారికి అప్పగిస్తున్నాను. తద్వారా దేశంలోని లక్షలాది మహిళలను ఎంతో ఉత్సాహపరిచినట్లవుతుంది. మీరు అలాంటి మహిళేనా? లేదా అలాంటి మహిళలు మీకు తెలుసా? అయితే అలాంటి మహిళల స్టోరీస్ #SheInspireUs తో ట్యాగ్ చేయండి” అని ప్రధాని నరేంద్రమోడీ ట్వీట్ చేశారు.



Related Post