మజ్లీస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై కాంగ్రెస్ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్రెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇటీవల అసదుద్దీన్ ఓవైసీ సంగారెడ్డిలో మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, కాంగ్రెస్ నేతలు డబ్బు పంచిపెడితే నిరభ్యంతరంగా తీసుకోండి కానీ ఓటు మాత్రం మజ్లీస్ పార్టీకే వేయండి,” అని అన్నారు.
దీనిపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసినా అసదుద్దీన్ ఓవైసీ స్పందించకపోవడంతో గురువారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికలలో డబ్బు తీసుకోమని ప్రజలను ప్రోత్సహించడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందే వస్తుంది కనుక ఎన్నికల నియామవలి ప్రకారం అసదుద్దీన్ ఓవైసీపై చర్యలు తీసుకోవాలని మర్రి శశిధర్రెడ్డి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే ప్రస్తుతం రాజ్యాంగ వ్యవస్థలు పనిచేస్తున్న తీరును గమనిస్తున్నవారికి ఈ పిర్యాదు .. చెత్తబుట్టలో చేరుకొంటుందని తెలుసు.