సీఏఏకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో బారీ ర్యాలీ

January 10, 2020


img

సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లను వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లో భారీ ర్యాలీ మొదలైంది. మీరాలమ్ ఈద్గాలో శుక్రవారం మధ్యాహ్నం ప్రార్ధనలు పూర్తయిన తరువాత ముస్లింలు జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సుమారు 40 నుంచి 50వేల మంది పాల్గొన్నట్లు అంచనా. హసన్ నగర్, ఆరాంఘర్, మైలదేవ్ పల్లి మీదుగా శాస్త్రీపురం వరకు ర్యాలీ సాగుతుంది. సాయంత్రం 5 గంటలకు అక్కడ బహిరంగసభ నిర్వహించనున్నారు. ఆ సభలో మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ, ముస్లిం యునైటెడ్ యాక్షన్ కమిటీ సభ్యులు ప్రసంగించనున్నారు. ర్యాలీ, బహిరంగసభ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతాఏర్పాట్లు చేశారు. ఆయా ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించి వేరే మార్గాలకు మళ్లిస్తున్నారు. 



Related Post