మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇవ్వొద్దు: హైకోర్టు

January 06, 2020


img

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వేసిన పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత రేపు ఈ కేసుపై విచారణ పూర్తయ్యేవరకు ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ చేయవద్దని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. 

ముందుగా రిజర్వేషన్లు ప్రకటించకుండా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం రాజ్యాంగ విరుద్దమంటూ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్‌ వేశారు. ముందుగా రిజర్వేషన్లు ప్రకటించి, వాటిపై అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరించిన తరువాత అభ్యర్ధులను ఖరారు చేసుకోవడానికి పార్టీలకు తగినంత సమయం ఇవ్వకుండా హడావుడిగా షెడ్యూల్ ప్రకటించేసి నామినేషన్లకు రెండు రోజుల ముందు రిజర్వేషన్లు ఖరారు చేయడాన్ని ఉత్తమ్‌కుమార్ రెడ్డి తప్పు పట్టారు. కనుక రేపు జరుగబోయే విచారణ తరువాత హైకోర్టు ఏమి చెపుతుందో చూడాలి. 



Related Post