టిఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఓ శుభవార్త! వారి పదవీవిరమణ వయసును 58 నుంచి 60 సం.లకు పెంచుతూ ప్రభుత్వం బుదవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఆర్టీసీలో పనిచేస్తున్న సుమారు 50,000 మంది కార్మికులకు వర్తిస్తుంది. దీనిపై ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 55 రోజుల సమ్మెకు ముగింపు పలికిన తరువాత వారి పదవీవిరమణ వయసును 58 నుంచి 60 సం.లకు పెంచుతానని సిఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకొంటూ నేడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.