తరగతిగదిలో ప్రొఫెసర్ అత్యాచారం

December 25, 2019


img

దిశ నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసినప్పటికీ మృగాళ్ళు ఏమాత్రం భయపడకుండా అత్యాచారాలు చేస్తూనే ఉండటం విస్మయం కలిగిస్తుంది. అదీ...రాజధాని హైదరాబాద్‌లో! 

నగరశివారులోని మైసమ్మగూడ వద్దగల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకటయ్య బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్ధినిపై సోమవారం సాయంత్రం ల్యాబ్‌లో అత్యాచారం చేశాడు. ఆమెను ల్యాబ్‌కు రమ్మనమని చెప్పి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆమె వెంటనే తన స్వస్థలం కరీంనగర్‌ వెళ్ళిపోయి తల్లితండ్రులకు ఈవిషయం చెప్పడంతో వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని వెంకటయ్యను అరెస్ట్ చేశారు.

దిశ కేసులో నిందితులవంటివారు పెద్దగా చదువుకోకపోవడం వలన, మొదటి నుంచి చెడుతిరుగుళ్ళకు అలవాటుపడటం వలన అటువంటి నేరం చేయడం ఆశ్చర్యం కాదు కానీ విద్యాధికుడు, ఓ అసిస్టెంట్ ప్రొఫెసరుగా విద్యార్దులకు పాఠాలు చెపుతూ వారి భవిష్యత్‌ను తీర్చిదిద్దుతున్న వ్యక్తి కూడా ఇటువంటి నీచానికి పాల్పడటమే విస్మయం కలిగిస్తుంది. ఇటువంటి హేయమైన నేరాలు చేస్తే కటినమైన శిక్షలు పడుతున్నాయని, విషయం బయటకు పొక్కి జైలు పాలైతే సమాజంలో తనకున్న గౌరవం, పేరు ప్రతిష్టలు కోల్పోతానని తెలిసి ఉండి కూడా ఈ నేరం చేయడం చాలా ఆశ్చర్యకరమే. అంటే చట్టాలు, శిక్షలు ఇటువంటి నేరస్తులకు భయం కలిగించడం లేదని స్పష్టం అవుతోంది. అయితే ఈ నేరాలను అరికట్టేందుకు ఇంకేమి చేయాలి? అందరూ ఆలోచించాల్సిందే!


Related Post