సీనియర్ కాంగ్రెస్ నేత విజయశాంతి సిఎం కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేస్తూ తన ఫేస్బుక్ పేజీలో ఈరోజు ఒక పోస్ట్ పెట్టారు. హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ సిఎం కేసీఆర్లో నెలకొన్న భయాలకు అద్దం పడుతోందన్నారు. తెరాసలోనే ఎవరో తన ప్రభుత్వాన్ని కూలద్రోయడానికి ప్రయత్నిస్తుంటే సిఎం కేసీఆర్ పైకి అది చెప్పుకోలేక తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపిస్తున్నారని అన్నారు. నిజానికి ఆయనే ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తెరాసలోకి ఫిరాయింపజేసి శాసనసభలో ప్రతిపక్షమే లేకుండా చేశారని విజయశాంతి ఆరోపించారు. ఒకవేళ సిఎం కేసీఆర్ గద్దె దిగవలసి వస్తే తెరాసలో ఎవరు ఆ సీట్లో కూర్చోంటారో ఆలోచించుకోవాలని విజయశాంతి అన్నారు. ఇంకా ఆమె ఏమన్నారంటే…