హుజూర్నగర్ ఉప ఎన్నికలలో బిజెపి అభ్యర్ధిగా బరిలో దిగిన శ్రీకళారెడ్డి
కుటుంబసభ్యుల ఒత్తిడిమేరకు పోటీ నుంచి విరమించుకోవడంతో ఆమె స్థానంలో కోట రామారావును
అభ్యర్ధిగా బిజెపి ఖరారు చేసింది. తెరాస అభ్యర్ధిగా సైదిరెడ్డి,
కాంగ్రెస్ అభ్యర్ధిగా పద్మావతీ రెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తెరాస, కాంగ్రెస్ పార్టీలు బలమైన అభ్యర్ధులను బరిలో దింపుతుండగా బిజెపి ఆఖరు నిమిషంలో
అభ్యర్ధిని మార్చడమే కాకుండా నియోజకవర్గ ప్రజలకు పెద్దగా పరిచయం లేని వ్యక్తిని అభ్యర్ధిగా
ప్రకటించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కనుక ఇప్పుడు పోటీ ప్రధానంగా కాంగ్రెస్, బిజెపిల మద్యనే జరిగే అవకాశం ఉంది.