కాంగ్రెస్ అధిష్టానం పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతీ రెడ్డికే హుజూర్నగర్ టికెట్ ఖరారు చేసింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ ఈ విషయం డిల్లీలో ప్రకటించారు. దీంతో రేవంత్ రెడ్డికి పార్టీలో తొలిసారిగా ఎదురుదెబ్బ తగిలింది. ఆయన చామల కిరణ్ రెడ్డికి హుజూర్నగర్ టికెట్ ఇవ్వాలని ప్రతిపాదించగా, పార్టీలో సీనియర్లు అందరూ పద్మావతీ రెడ్డికే మద్దతు తెలుపడంతో కాంగ్రెస్ అధిష్టానం ఆమెకే టికెట్ ఖరారు చేసింది. మూడు ప్రధానపార్టీలు అభ్యర్ధులను ప్రకటించాయి కనుక ఇక నామినేషన్లు వేసి రంగంలో దిగడమే మిగిలుంది.
హుజూర్నగర్ ఉప ఎన్నికల షెడ్యూల్:
నోటిఫికేషన్: సెప్టెంబర్ 23
నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ: సెప్టెంబర్ 30
నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 1
ఉపసంహరణకు గడువు: అక్టోబర్ 3
పోలింగ్: అక్టోబర్ 21
కౌంటింగ్ మరియు ఫలితాల ప్రకటన: అక్టోబర్ 24.